rajputh: ‘పద్మావత్‌’ దర్శకుడు ఆత్మాహుతికి పాల్పడాలంటోన్న రాజ్‌పుత్ మహిళలు

  • విడుదలకు సిద్ధమైన ‘పద్మావత్‌’
  • విడుదల చేస్తే ఊరుకోబోమంటోన్న రాజ్‌పుత్‌ కర్ణిసేనలు
  • గతంలో ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించిన రాజ్‌పుత్‌ మహిళలు
  • భన్సాలీ చితికి నిప్పులు పెడతామని తాజాగా హెచ్చరిక

బాలీవుడ్ సినిమా ‘పద్మావత్‌’ విడుదలకు సమయం సమీపిస్తోన్న కొద్దీ ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ సినిమా విషయంలో సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించి సినిమాపై నిషేధం ఎత్తివేయాల్సిందిగా ఆయా రాష్ట్రాలను ఆదేశించడంతో రాజ్‌పుత్ క‌ర్ణిసేన‌లు భ‌గ్గుమంటున్నాయి.

ఈ సినిమా విడుదల చేస్తే తాము జౌహర్‌ (ఆత్మాహుతి)కి పాల్ప‌డతామని గతంలో క్షత్రియ వర్గానికి చెందిన మహిళలు హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. తాజాగా రాజ్‌పుత్‌ వర్గానికి చెందిన మహిళలు మీడియాతో మాట్లాడుతూ... దర్శకుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ జౌహర్‌ (ఆత్మాహుతి)కి పాల్పడాలని, అప్పుడు ఆయన చితికి తామే నిప్పుపెడతామని వ్యాఖ్యానించారు. ఈ సినిమా విడుదల చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. 

More Telugu News