అదొక అశ్లీల చిత్రం.. ముస్లింలు ఎవరూ దాన్ని చూడొద్దు: అసదుద్దీన్ ఒవైసీ

- 'పద్మావత్' చిత్రంపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- అదొక కట్టు కథ
- ఆ సినిమా కోసం డబ్బు, సమయం వేస్ట్ చేసుకోవద్దు
1540 నాటి చరిత్ర అంటూ ముస్లిం కవి మల్లిక్ మహ్మద్ రాసిన ఫిక్షన్ కథే ఇది అని తెలిపారు. ఈ సినిమాను అడ్డుకునేందుకు ప్రధాని మోదీ 12 మంది సభ్యులతో కమిటీని నియమించారని చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన వీహెచ్పీ నేత ప్రవీణ్ తొగాడియాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ, ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆరోపించారు.