girls: ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని ప్రేమించుకున్న ఇద్దరమ్మాయిలు.. ఆపై పారిపోయిన వైనం

  • బెంగళూరు కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు
  • ఫేస్‌బుక్‌లో ఛాటింగ్‌ చేసుకున్న బెంగళూరు గీత, మహారాష్ట్ర దీపా
  • మహారాష్ట్ర నుంచి గీత వద్దకు వచ్చిన దీపా
  • పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదని మహారాష్ట్రకు వెళ్లిపోయిన జంట

ఇద్ద‌రు అమ్మాయిలు ఫేస్‌బుక్‌లో పరిచయమై, ప్రేమించుకుని తమ తమ ఇళ్లలోంచి పారిపోయిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు కోరమంగల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వారి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతుల కోసం గాలిస్తున్నారు.

 పూర్తి వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని ఆడుగోడిలో నివసించే గీత అనే యువతి మహారాష్ట్ర నాసిక్ వాసి అయిన దీపాకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైంది. విచిత్రంగా వారిద్దరి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల మహారాష్ట్ర నుంచి దీపా బెంగళూరుకు వచ్చి గీతను కలిసింది. గీత, దీపా ఇద్దరు కలిసి.. గీత తల్లిండ్రుల వద్దకు వెళ్లి పెళ్లి చేసుకుంటామని చెప్పారు. దీంతో ఇద్దరమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటని గీత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దీపా, గీత మహారాష్ట్రకు పారిపోయారు.

More Telugu News