దుబాయ్, షార్జాలకు విజయవాడ నుంచి తొలి ఇంటర్నేషనల్ విమాన సర్వీస్.. రేపే ప్రారంభం!

  • తీరనున్న అమరావతి వాసుల మరో కల
  • దుబాయ్, షార్జాలకు వెళ్లనున్న విమానం
  • ఎయిర్ ఇండియా సేవలు అందుబాటులోకి
  • ప్రారంభించనున్న అశోక గజపతిరాజు
రోజురోజుకూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ, అమరావతి వాసుల మరో కల తీరనుంది. ఇక్కడి నుంచి తొలి అంతర్జాతీయ సర్వీసు రేపు ప్రారంభం కానుంది. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా ఈ ఘనతను సొంతం చేసుకోనుంది. శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో జరిగే ఓ కార్యక్రమంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు తొలి సర్వీసును ప్రారంభించనున్నారు.

దుబాయ్, షార్జాలకు ఈ విమానం నడుస్తుంది. విజయవాడలో ఇప్పటికే ఇమిగ్రేషన్, కస్టమ్స్ విభాగాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ విమానం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి బయలుదేరి 9.45కు విజయవాడకు వచ్చి, ఆపై ఉదయం 10.30కి బయలుదేరి ముంబై మీదుగా దుబాయ్, షార్జాలకు వెళుతుంది. ముంబైకి అక్కడి నుంచి యూఏఈకి వెళ్లే సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ విమానానికి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రైవేటు విమాన సంస్థలు ఇంటర్నేషనల్ సర్వీసులను విజయవాడ నుంచి ప్రారంభించేందుకు సాహసం చేయలేకపోతున్న వేళ, ఎయిర్ ఇండియా ముందుకు రావడం గమనార్హం.
Go Back to Shorts
Vijayawada
Amaravati
Air India
International Service
Gannavaram

More Telugu News