YSRCP: వైసీపీని వంగవీటి రాధ వీడే ప్రసక్తే లేదు: వెల్లంపల్లి శ్రీనివాస్

  • టీడీపీ మైండ్ గేమ్ లో భాగంగానే ఈ వదంతులు
  • రాధ అసంతృప్తితో ఉన్నాడనేదీ టీడీపీ నేతల కల్పితాలే
  • వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్

వైసీపీ నాయకుడు వంగవీటి రాధ ఆ పార్టీని వీడనున్నట్టు వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, వంగవీటి రాధను తమ పార్టీకి చెందిన మరో నేత అప్పిరెడ్డి భేటీ అయ్యారని, పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయనతో చర్చించారని చెప్పారు.

 వైసీపీని రాధ వీడే అవకాశమే లేదని, టీడీపీ మైండ్ గేమ్ లో భాగంగానే ఈ వదంతులు వ్యాపించాయని అన్నారు. రాధ అసంతృప్తితో ఉన్నాడనేది కూడా టీడీపీ నేతల కల్పితాలేనని మండిపడ్డారు. కాగా, రాధ పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండిస్తున్నామని, ఓ పథకం ప్రకారమే ఇలాంటి దుష్ప్రచారం జరుగుతోందని రాధా - రంగా మిత్ర మండలి సభ్యుడు అడపా శేషు పేర్కొన్నారు.

More Telugu News