maari: 'మారి 2' చిత్రంలో పాట పాడిన మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా

  • ట్వీట్ ద్వారా వెల్ల‌డించిన ధ‌నుష్‌
  • సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న యువ‌న్ శంక‌ర్ రాజా
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న బాలాజీ మోహ‌న్‌

'మారి' చిత్రానికి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న 'మారి 2' చిత్రంలో మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా ఓ పాట‌ను పాడారు. ఈ విష‌యాన్ని హీరో ధ‌నుష్ ట్విట్ట‌ర్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారు. `మారి 2 చిత్రం కోసం ఇళ‌య‌రాజా పాట పాడారు. చాలా సంతోషంగా ఉంది` అని ధ‌నుష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఇళ‌య‌రాజాతో దిగిన ఫొటోల‌ను కూడా ధ‌నుష్ షేర్ చేశారు. మారి 2 చిత్రానికి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీత‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలాజీ మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ధ‌నుష్ స‌ర‌స‌న 'ఫిదా' బ్యూటీ సాయి ప‌ల్ల‌వి న‌టిస్తోంది.

More Telugu News