Hyderabad: హైదరాబాద్‌లో గ్యాంగ్‌ వార్‌.. వీధిలో చితక్కొట్టుకున్న యువకులు

  • కాచిగూడ వెంక‌టేశ్వ‌ర కాల‌నీలో ఘటన
  • దాదాపు అర్ధ‌గంట పాటు పరస్పరం దాడి చేసుకున్న యువకులు
  • బిల్డింగ్ పై నుంచి దృశ్యాల‌ను సెల్ ఫోన్ లో రికార్డు చేసిన వ్యక్తి
  • కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌లోని కాచిగూడ వెంక‌టేశ్వ‌ర కాల‌నీలో రెండు వ‌ర్గాల‌కు చెందిన యువ‌కులు కలకలం రేపారు. ప‌ర‌స్ప‌రం దాడికి దిగి రచ్చ రచ్చ చేశారు. బిల్డింగ్ పై నుంచి ఓ వ్య‌క్తి ఈ దృశ్యాల‌ను సెల్ ఫోన్ లో రికార్డు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. దాదాపు అర్ధ‌గంట పాటు వీధిలో గ్యాంగ్ వార్ జరిగింది. ఒక‌రిపై ఒక‌రు పిడిగుద్దులు కురిపించుకుంటూ రెచ్చిపోవడంతో స్థానికులు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. ఈ ఘ‌ట‌న‌పై కాచిగూడ పోలీసులు పెటీ కేసు నమోదు చేశారు. అయితే, అలజడి రేపిన యువకులను అరెస్టు చేయలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

More Telugu News