anoushka shankar: భర్త నుంచి విడిపోయిన అనౌష్క శంకర్!

  • భర్త జో రైట్ తో వివాహబంధానికి ముగింపు
  • 2010లో వివాహం
  • జో రైట్ బ్రిటీష్ ఫిల్మ్ డైరెక్టర్

ప్రపంచ ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు, దివంగత పండిట్ రవిశంకర్ కుమార్తె అనౌష్క శంకర్ తన వివాహ బంధానికి ముగింపు పలికింది. వివరాల్లోకి వెళ్తే, బ్రిటీష్ ఫిల్మ్ డైరెక్టర్ జో రైట్ ను 2010 సెప్టెంబర్ లో ఆమె పెళ్లాడింది. వీరిద్దరూ విడిపోయారనే విషయాన్ని 'పేజ్ సిక్స్' వెబ్ పత్రిక ధ్రువీకరించింది. అనౌష్క, జో రైట్ లు ఇటీవలే విడిపోయారని... తమ ఇద్దరి పిల్లల సంరక్షణ, సంతోషం కోసం ఇకపై కూడా ఇద్దరూ కలసి బాధ్యత తీసుకుంటారంటూ జో ప్రతినిధి చెప్పినట్టు పేజ్ సిక్స్ వెల్లడించింది. వీరికి జుబిన్ శంకర్ రైట్, మోహన్ శంకర్ రైట్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

గత ఏడాది అనౌష్క, జో రైట్ లు గ్రామీ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. 'తనతో పాటు ఈ వ్యక్తి గ్రామీస్ కు రావడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. తొలిసారి నాతో పాటు వచ్చాడు' అంటూ ఆ సందర్భంగా తన భర్త గురించి అనౌష్క ట్వీట్ చేసింది. కాగా, 20 ఏళ్ల వయసులోనే గ్రామీకి అనౌష్క నామినేట్ అయింది. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు నామినేట్ అయింది. కానీ, ఇంత వరకు ఒక్క గ్రామీని కూడా గెలుచుకోలేదు.

More Telugu News