padmavat: 'యూపీలో ‘పద్మావత్‌’ విడుదల అవుతుందా?' అని అడిగిన మీడియా.. అసహనం వ్యక్తం చేసిన యోగి ఆదిత్యనాథ్

  • ఈ నెల 25న విడుదల కానున్న ‘పద్మావత్‌’
  • ఈ సినిమా విడుదల అవుతుందో లేదో చెప్పడానికి నేను జ్యోతిష్యుడిని కాదు: యోగి
  • పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడనున్న భన్సాలీ

సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న బాలీవుడ్ సినిమా ‘పద్మావత్‌’ ఈ నెల  25న విడుదల కానున్న విష‌యం తెలిసిందే. అయితే, రాజ‌స్థాన్‌, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మాత్రం ఈ సినిమా త‌మ త‌మ‌ రాష్ట్రాల్లో విడుదలయ్యే అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇక‌ యోగి ఆదిత్య‌నాథ్ సీఎంగా ఉన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఈ సినిమా విడుద‌ల అవుతుందా? అనే సందేహం అందరిలోనూ ఉంది. ఈ విషయంపై మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు యోగి ఆదిత్యనాథ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

త‌మ రాష్ట్రంలో ఈ సినిమా విడుదల అవుతుందా? లేదా? అని చెప్పడానికి తానేం జ్యోతిష్యుడిని కానని యోగి ఆదిత్యనాథ్ స‌మాధానం ఇచ్చారు. కాగా, త‌న సినిమా విడుద‌ల విష‌య‌మై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ద‌ర్శ‌కుడు భన్సాలీ చర్చించనున్నారు.

More Telugu News