rtc: బ్రేకులు పని చేయకపోవడంతో... బజాజ్‌ షోరూమ్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

  • పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఘటన
  • ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
  • ముగ్గురు స్థానికులకు తీవ్ర గాయాలు
  • షో రూమ్‌లోని వాహనాలు ధ్వంసం

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రయాణికులతో వెళుతోన్న సదరు బస్సు బ్రేకులు, స్టీరింగ్ ఒక్కసారిగా పనిచేయకపోవడంతో అక్కడి బజాజ్‌ షోరూమ్‌లోకి దూసుకెళ్లడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

షో రూమ్‌లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో భయపడిపోయిన బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు పెట్టారు. అయితే, వారికి గాయాలేమీ కాలేదు కానీ, షోరూంలోని కొందరికి మాత్రం గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

More Telugu News