adivi shesh: మళ్లీ ఇన్నాళ్లకి కెమెరా ముందుకు పవన్ తొలి హీరోయిన్!

  • అడివి శేష్ హీరోగా 'గూఢచారి'
  • హీరోయిన్ గా శోభితా ధూళిపాళ్ల 
  • కీలకమైన పాత్రలో సుప్రియ      

చాలాకాలం క్రితం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన నాగార్జున మేనకోడలు 'సుప్రియ' కథానాయికగా నటించారు. ఆ తరువాత ఆమె నటనను పక్కన పెట్టేసి, ప్రొడక్షన్ వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. తాజాగా ఆమె 'గూఢచారి' సినిమాలో నటిస్తుండటం విశేషం.

 అడివి శేష్ .. శోభితా ధూళిపాళ్ల జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో, సుప్రియ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో సుప్రియ చేస్తోన్న పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండటం వలన, నటించడానికి ఆమె అంగీకరించిందని అంటున్నారు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. స్పై థ్రిల్లర్ గా శశికిరణ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై, అడివి శేష్ బలమైన నమ్మకంతో వున్నాడు.     

More Telugu News