Telangana: హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిపోయిన ‘రైల్ నీర్’ ప్రాజెక్టు.. వేలాదిమందికి ఉపాధి!

  • ఏపీకి వరంగా మారిన తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం
  • రైల్ నీర్ ప్రాజెక్టు నూజివీడుకు షిఫ్ట్
  • మొత్తం పదివేల మందికి ఉపాధి అవకాశాలు
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌కు వరమైంది. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్వంలో రూ.50 కోట్ల అంచనాలతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాల్సిన ప్రతిష్ఠాత్మక ‘రైల్ నీర్’ ప్రాజెక్టు ఏపీకి తరలిపోయింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా ఐదువేల మందికి, పరోక్షంగా మరో ఐదు వేలమందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

‘రైల్ నీర్’ ప్రాజెక్టును హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు 2012లో ప్రయత్నాలు మొదలైనా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు భూమి, ఇతర వనరులను కేటాయించలేదు. దీంతో ఇక లాభం లేదని భావించిన ఐఆర్‌సీటీసీ దానిని ఏపీకి తరలించింది. నూజివీడు దగ్గర ఫ్యాక్టరీని నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించింది.
Telangana
Andhra Pradesh
IRCTC
Rail neer

More Telugu News