India: మైదానంలో ప్రాక్టీస్.. చెమ‌టోడుస్తోన్న టీమిండియా!

  • ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా
  • మొదటి టెస్టులో ఓటమి
  • ఎల్లుండి రెండో టెస్టు

ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా మొద‌టి టెస్టులో ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. దీంతో రెండో టెస్టులోనైనా గెల‌వాల‌న్న క‌సితో, మైదానంలో ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేస్తూ చెమ‌టోడుస్తున్నారు. ద‌క్షిణాఫ్రికా, టీమిండియా మధ్య జ‌రుగుతోన్న మూడు టెస్టుల సిరిస్‌లో రెండో టెస్టు ఎల్లుండి జ‌రగ‌నుంది. రెండో టెస్టులో కూడా టీమిండియా ఓడిపోతే టెస్టు సిరీస్‌ను కోల్పోతుంది. కాగా, దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ప్రాక్టీస్ చేస్తూ కష్టపడుతున్నారు. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకోవాలని ఉత్సాహం చూపుతున్నారు.      

More Telugu News