raviteja: శ్రీను వైట్ల నెక్స్ట్ మూవీకి సన్నాహాలు .. ఎన్నారైగా రవితేజ

  • విడుదలకి సిద్ధంగా 'టచ్ చేసి చూడు' 
  • రెగ్యులర్ షూటింగుకి కల్యాణ్ కృష్ణ మూవీ 
  • త్వరలో శ్రీను వైట్లతో సెట్స్ పైకి  

రవితేజ నుంచి 'టచ్ చేసి చూడు' సినిమా రాబోతోంది. విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రాశిఖన్నా .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయడానికి రవితేజ రెడీ అవుతున్నాడు. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి సిద్ధమవుతోంది.

ఈ ప్రాజెక్టు తరువాత శ్రీను వైట్లతో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో ఆయన ఎన్నారైగా కనిపించనున్నాడని సమాచారం. మాస్ ఆడియన్స్ ఆశించే అన్ని అంశాలను మేళవిస్తూనే ఈ ఎన్నారై పాత్రను శ్రీను వైట్ల డిజైన్ చేశాడని చెబుతున్నారు. కొంతభాగం హైదరాబాద్ లో .. మరికొంత భాగం విదేశాల్లో చిత్రీకరించనున్నారట. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

More Telugu News