Madhya Pradesh: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేతకు ఘోర అవమానం... మెడలో చెప్పుల దండ.. ఫోటో చూడండి!

  • స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన దినేశ్ శర్మ
  • చెప్పులను దండగా వేసిన ఓటర్
  • నీటి సమస్యను పరిష్కరించనందుకే ఈ సత్కారమట 

మధ్యప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఓ బీజేపీ నేతకు ఘోర అవమానం ఎదురైంది. థామ్ నోడ్ అనే ప్రాంతంలో దినేశ్ శర్మ అనే నేత, ఇంటింటి ప్రచారానికి వెళ్లి ఓట్లు అడుగుతుంటే, ఓ వ్యక్తి వచ్చి చెప్పుల దండను ఆయన మెడలో వేశాడు. దీంతో హుషారుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆయన షాక్ కు గురై, ఆ వెంటనే తేరుకున్నాడు.

తొలుత చెప్పులను పక్కకు పడేసేందుకు ప్రయత్నించిన శర్మ, ఆ వక్తి తన ప్రయత్నాన్ని మానకపోవడంతో దండ వేయించుకోవాల్సి వచ్చింది. ఆపై ఆయన మాట్లాడుతూ, తాను ప్రజల బిడ్డనని, తన నుంచి వారు ఏదో కోరుకుంటూ, తమలోని అసంతృప్తిని ఇలా వెల్లడించాడని చెప్పడం గమనార్హం. ఇక తాగు నీటి సమస్య అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రయోజనం కలగలేదని, అందుకే ఈ పని చేశానని చెప్పుల దండను తెచ్చిన వ్యక్తి వ్యాఖ్యానించాడు.

More Telugu News