Rail: అడవి ఆవుల మందను ఢీకొట్టి పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నాలుగు గంటలపాటు నిలిచిపోయిన రాకపోకలు

  • కడప జిల్లాలో ఘటన.. అకస్మాత్తుగా ట్రాక్‌పైకి ఆవుల మంద
  • ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు
  • ట్రాక్ పునరుద్ధరణకు నాలుగు గంటల సమయం

కడప నుంచి గుత్తి వైపు వెళ్తున్న గూడ్సు రైలు చిత్రావతి వంతెన సమీపంలో అడవి ఆవుల మందను ఢీకొట్టి పట్టాలు తప్పింది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా, దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను సరిచేసేందుకు నాలుగు గంటల సమయం పట్టింది. ఫలితంగా ఆ మార్గం మీదుగా ప్రయాణించే రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కోవలం-హైదరాబాద్, చెన్నై-ముంబై మధ్య ప్రయాణించే మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు ఆలస్యంగా నడిచాయి.

ఇక, ఈ ప్రమాదంలో ఏడు ఆవులు మృతి చెందగా, మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. చిత్రావతి వంతెన దాటిన తర్వాత ఆవుల మంద ఒక్కసారిగా పట్టాలపైకి రావడంతో ఈ ఘటన జరిగినట్టు లోకో పైలట్ తెలిపారు. పట్టాలు తప్పిన కంటైనర్‌ను తిరిగి పట్టాలపైకి చేర్చి, ట్రాక్‌ను పునరుద్ధరించాక రైళ్ల రాకపోకలకు అనుమతి ఇచ్చారు. 

More Telugu News