Nagarjuna: అఖిల్... నువ్వన్నా మార్చి చూపించు!: అక్కినేని ఫ్యామిలీకి అభిమానుల లేఖ!

  • అఖిల్ తాజా చిత్రం 'హలో'
  • వసూళ్లను రాబట్టడంలో విఫలం
  • నాగార్జున వద్ద పనిచేస్తున్న వారే కారణమంటున్న అభిమానులు
  • అఖిల్ కు అభిమానుల లేఖ

అక్కినేని నాగేశ్వరరావు మూడో తరం వారసుడిగా తెరంగేట్రం చేసిన అఖిల్ నటించిన రెండో చిత్రం కూడా వసూళ్ల విషయంలో నిరాశనే మిగల్చడంపై అక్కినేని అభిమానులు స్పందించారు. విశాఖపట్నంకు చెందిన అభిమానులు కొందరు అఖిల్ కు ఓ లేఖను రాస్తూ, అక్కినేని నాగార్జున వద్ద పనిచేస్తున్న కొందరి కారణంగానే ఈ పరిస్థితి ఎదురైందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అభిమానులు 3 వేల మంది కూడా ఉండరని రెచ్చగొట్టేలా వారు మాట్లాడారని, ఇది అసంఖ్యాక అభిమానుల మనసు కలచి వేసిందని చెప్పుకొచ్చారు.

అఖిల్ తొలి చిత్రం ఉత్తరాంధ్ర జిల్లాల్లో 100 చోట్ల విడుదలైతే, ఇటీవలి 'హలో' 53 థియేటర్లకే పరిమితమైందని, అఖిల్ క్రేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కొందరు పనిగట్టుకుని కూర్చున్నారని, తమ బాధ ఎవరితో పంచుకోవాలో తెలియడం లేదని వాపోయారు. మీరైనా అభిమానుల మనసులను అర్థం చేసుకోవాలని, పరిస్థితిని మార్చి చూపించాలని అఖిల్ ను వారు అభ్యర్థించారు. అక్కినేని ఫ్యామిలీ ఫ్యాన్స్ పేరిట విడుదలైన ఈ లేఖను మీరూ చూడవచ్చు.

More Telugu News