new year: కొత్త సంవ‌త్స‌రం రోజు పుట్టిన పాప‌కు డిగ్రీ వ‌ర‌కు ఉచిత విద్య‌

  • ప్ర‌క‌టించిన బెంగ‌ళూరు న‌గ‌ర‌పాల‌క సంస్థ‌
  • రాజాజీ న‌గ‌ర్ ప్ర‌జాసుప‌త్రిలో జ‌న్మించిన పాప‌
  • అర్థ‌రాత్రి 00:05 గంట‌ల‌కు జ‌న‌నం

కొత్త సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన ఐదు సెకన్ల‌కు పుట్టిన పాప‌కు డిగ్రీ వ‌ర‌కు ఉచిత విద్య అంద‌జేయ‌నున్న‌ట్లు బెంగ‌ళూరు న‌గ‌ర‌పాలక సంస్థ బృహ‌త్ బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలికే (బీబీఎంపీ) ప్రకటించింది. `ఆదివారం అర్థ‌రాత్రి త‌ర్వాత రాజాజీ న‌గ‌ర్ ప్ర‌జాసుపత్రిలో జ‌న్మించిన మొద‌టి పాప‌కు డిగ్రీ వ‌ర‌కు ఉచిత విద్య అంద‌జేయ‌నున్నాం. అందుకోసం ఆమె పేరిట రూ. 5 ల‌క్ష‌ల డిపాజిట్ వేస్తాం. దాని మీద వ‌చ్చే వ‌డ్డీ ఆమె చ‌దువుకు ఉప‌యోగ‌ప‌డుతుంది` అని బీబీఎంపీ ప్ర‌తినిధి ఎల్. సురేశ్ తెలిపారు.

అర్థ‌రాత్రి 00:05 గంట‌ల‌కు పుష్ప‌, గోపీ దంప‌తుల‌కు ఈ పాప జ‌న్మించింది. ఈ ప‌థ‌కం ద్వారా త‌మ కూతురు చ‌దువుకు స‌హాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని పాప త‌ల్లిదండ్రులు తెలిపారు. బాలిక‌ల విద్య‌ను ప్రోత్స‌హించ‌డానికి బీబీఎంపీ ఈ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. సాధార‌ణ డెలివ‌రీ ద్వారా, ప్ర‌భుత్వాసుపత్రుల్లో కాన్పు చేయించుకున్న‌వారే ఇందుకు అర్హుల‌ని గ‌తంలో మేయ‌ర్ సంప‌త్ రాజ్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

More Telugu News