ys rajashekar reddy: వెండితెరకు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితకథ.. ప్రధాన పాత్ర‌లో మమ్ముట్టి?

  • దివంగ‌త మాజీ సీఎం బ‌యోపిక్‌లో మ‌మ్ముట్టి
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న మ‌హి వి. రాఘ‌వ్‌
  • అంగీక‌రించిన వైఎస్ జ‌గ‌న్‌

సినిమాల్లో జీవిత‌క‌థ‌లకు మంచి డిమాండ్ ఉంది. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్... ఇలా ఏ సినీప‌రిశ్ర‌మ‌లోనైనా బ‌యోపిక్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అదే బాట‌లో ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ టాలీవుడ్‌లో రాబోతోంది. మాజీ ముఖ్య‌మంత్రి దివంగత వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితాధారంగా ఓ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ చిత్రంలో ఆయ‌న పాత్ర‌లో ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టి న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఈ చిత్రానికి మ‌హి వి. రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ‘ఆనందో బ్రహ్మ’ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాకు మ‌హి ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. వైఎస్సార్ బ‌యోపిక్ తీయ‌డానికి ఆయ‌న కుమారుడు, వైకాపా అధినేత జగన్‌ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి మ‌రింత స‌మాచారాన్ని ద‌ర్శ‌కుడు మ‌హి వి. రాఘ‌వ్ ప్ర‌క‌టించ‌నున్నారు.

More Telugu News