Pakistan: పాకిస్థాన్ మమ్మల్ని మోసం చేస్తూ వచ్చింది.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు!

  • గత 15 సంవ‌త్స‌రాల నుంచి పాక్‌కు తెలివితక్కువగా నిధులు ఇచ్చాం
  • సుమారు 33 బిలియన్‌ డాలర్లకు పైగా పాక్‌ తీసుకుంది
  • పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగానే ఉంది

ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గత 15 సంవ‌త్స‌రాల నుంచి పాకిస్థాన్‌కు త‌మ దేశం తెలివితక్కువగా నిధులు అందించింద‌ని అన్నారు. సుమారు 33 బిలియన్‌ డాలర్లకు పైగా అమెరికా ఇచ్చింద‌ని, కానీ పాక్‌ మాత్రం త‌మ దేశాన్ని మోసం చేస్తూ అస‌త్యాలు చెప్పింద‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. త‌మ దేశ నేతలను పాక్ అజ్ఞానుల‌ని అనుకుంటోంద‌ని, పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగానే ఉందని, ఇక ఆ దేశ‌పు ఆటలు సాగబోవని అన్నారు. డొనాల్డ్‌ ట్రంప్ గ‌తంలోనూ పాకిస్థాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విష‌యం తెలిసిందే.

More Telugu News