sai dharam tej: మస్కట్ షెడ్యూల్ ముగించిన 'ధర్మాభాయ్'

  • వినాయక్ దర్శకత్వంలో 'ధర్మా భాయ్'
  • ముగింపు దశకి చేరుకున్న షూటింగ్ 
  • ఫిబ్రవరి 9న విడుదల  

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు చేయడంలో వినాయక్ కి తిరుగులేదనే విషయాన్ని ఆయన గత చిత్రాలు నిరూపించాయి. అలాగే మాస్ ఆడియన్స్ మనసును పట్టేసే కథలకే సాయిధరమ్ తేజ్ ప్రాముఖ్యతనిస్తాడనే విషయం కూడా అందరికీ తెలిసిందే. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది .. దాని పేరే 'ధర్మాభాయ్'.

రీసెంట్ గా ఈ సినిమా 'మస్కట్'లో ఒక షెడ్యూల్ ను ముగించింది. అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడంతో, ఈ సినిమా షూటింగ్ ముగింపుదశకి చేరుకుంది. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న తేజు, ఈ సినిమాతో హిట్ అందుకోవడం ఖాయమేననే నమ్మకంతో వున్నాడు.    

More Telugu News