tiger zinda hai: 'టైగర్ జిందా హై' సినిమాతో ప్ర‌ధాని మోదీకి సంబంధం?

  • వెల్ల‌డించిన ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్‌
  • 2014లో ప్ర‌భుత్వం చేపట్టిన మిష‌న్ క‌థాంశానికి మూలం
  • ఆ మిష‌న్ న‌డిపించింది మోదీ?

వ‌సూళ్ల రికార్డులు సృష్టిస్తున్న స‌ల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై' చిత్రానికి, భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి మ‌ధ్య ఓ సంబంధం ఉంది. ఈ చిత్రం క‌థ‌కు మోదీ చేపట్టిన ఓ రెస్క్యూ మిష‌న్ ఆదర్శ‌మ‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిత్ర‌ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్ వెల్ల‌డించారు. 2014లో ఇరాక్‌లో చిక్కుకుపోయిన 46 మంది న‌ర్సుల‌ను ఓ మిష‌న్ చేపట్టి సుర‌క్షితంగా భార‌త్ కు తీసుకువ‌చ్చారు.

మోదీ అధికారంలోకి వ‌చ్చాక కొన్ని రోజుల్లోనే ఈ మిష‌న్ ప్రారంభ‌మైంది. ఆ మిష‌న్ ఆద‌ర్శంగా తీసుకుని, మోదీ పాల‌నా చాక‌చ‌క్యాన్ని గుర్తిస్తూ ఈ సినిమాను ఆయ‌న‌కు అంకితం చేస్తున్న‌ట్లు అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెలిపారు. నిజానికి ఈ సినిమాలో ఒకానొక చోట మోదీ పేరు ప్రస్తావ‌న కూడా తీసుకువ‌చ్చార‌ట‌. కానీ సీబీఎఫ్‌సీ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఆ మాట‌లు మార్చిన‌ట్లు జాఫ‌ర్ చెప్పారు.

More Telugu News