india: మాపై గెలవడం అంత ఈజీ కాదు: దక్షిణాఫ్రికా

  • వచ్చే నెల 5 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం
  • ఆ తరువాత ఆరు వన్డేలు, మూడు టీ20లు
  • టెస్టు సిరీస్‌ భారత్‌కు అగ్ని పరీక్ష వంటిది
  • మా జట్టులో డేల్‌ స్టెయిన్ కూడా ఆడుతున్నాడు-మోర్నీ మోర్కెల్

వచ్చేనెల నెల 5 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆరు వన్డేలు, మూడు టీ20లు కూడా జరగనున్నాయి. భారత్ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు మన జట్టు ఒక్క టెస్ట్ సిరీస్ కూడా గెలవలేదు. తాజాగా సఫారీ బౌలర్‌ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. తమ దేశంలో టీమిండియా గెలవడం అంత ఈజీ కాదని వ్యాఖ్యానించాడు. టెస్టు సిరీస్‌ భారత్‌కు అగ్ని పరీక్ష వంటిదని చెప్పుకొచ్చాడు. కాగా, సుదీర్ఘ కాలం తరువాత తమ ఆటగాడు డేల్‌ స్టెయిన్‌పై మోర్కెల్ మళ్లీ ఆడుతున్నాడని, అతడు నెట్స్‌లో అద్భుతంగా బంతులు విసురుతున్నాడని చెప్పాడు.

More Telugu News