allu sirish: 'ఒక్క క్షణం'లో కామెడీ అందుకే తగ్గింది: అల్లు శిరీష్

  • అసలు కథ నిడివి ఎక్కువగా వుంది
  • అందుకే కామెడీ సీన్స్ లో కొన్ని లేపేయవలసి వచ్చింది 
  • ఫోక్ సాంగ్ ను కూడా అందుకే ఉంచలేదు  

అల్లు శిరీష్ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ తెరకెక్కించిన 'ఒక్క క్షణం' ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. అయితే ఇంతకు ముందు వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయింది. 'ఒక్క క్షణం' విషయానికి వస్తే కామెడీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం లోపంగా అనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ఈ విషయంపై అల్లు శిరీష్ స్పందిస్తూ .. "ముందుగా ఈ సినిమా కోసం చాలా కామెడీ సీన్స్ అనుకున్నాం. ఆడియన్స్ ను ఆకట్టుకునే స్థాయిలో వాటిని చిత్రీకరించడం కూడా జరిగిపోయింది. అయితే అసలు కథకి సంబంధించిన నిడివి పెరిగిపోవడం వలన, కామెడీ సీన్స్ ను తగ్గించడం జరిగింది. ఈ సినిమా కోసం అద్భుతంగా చిత్రీకరించిన ఒక ఫోక్ సాంగ్ ను కూడా, అప్పటికే నిడివి ఎక్కువపోయిందనే ఉద్దేశంతో లేపేశాము. రోలింగ్ టైటిల్స్ తరువాత వచ్చేది ఆ సాంగే" అని చెప్పుకొచ్చాడు.    

More Telugu News