jio: కొత్త ప్లాన్లు: జియో రూ. 98 అయితే ఎయిర్‌టెల్ రూ. 93కే!

  • వ్యాలిడిటీలో స్వ‌ల్ప తేడా
  • ప‌రిమితులు లేని వాడ‌కం
  • కొత్త ప్లాన్ల‌తో ముందుకు వ‌స్తున్న ప్రైవేట్ సంస్థ‌లు

ఇటీవ‌ల రూ. 98 రీఛార్జీతో 14 రోజుల వ్యాలిడిటీ, 2.1 జీబీ డేటా ఆఫ‌ర్‌ను జియో ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. దీనికి ప్ర‌తిగా ఓ రూ. 5 తగ్గించి టెలికాం దిగ్గ‌జం ఎయిర్‌టెల్ రూ. 93 రీఛార్జీ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా ప‌ది రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ డేటాను అంద‌జేస్తోంది. వ్యాలిడిటీ విష‌యంలో స్వ‌ల్ప తేడా ఉన్నప్పటికీ, జియో మాదిరిగా రోజుకి 0.15 జీబీ మాత్ర‌మే వాడుకోవాల‌ని ఎయిర్‌టెల్ ప‌రిమితుల‌ను విధించ‌లేదు. అలాగే అప‌రిమిత లోక‌ల్‌, ఎస్టీడీ కాల్స్‌, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల‌ను అంద‌జేస్తోంది.

న్యూఇయ‌ర్ సంద‌ర్భంగా జియోకు గట్టిపోటీని ఇవ్వ‌డానికి ప్రైవేట్ టెలికాం సంస్థ‌లు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఎయిర్‌టెల్‌తో పాటు ఐడియా, వొడాఫోన్‌లు కూడా ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తున్నాయి. ఏదేమైనా కొత్త‌సంవ‌త్స‌రం పుణ్య‌మాని వినియోగ‌దారుడు లాభ‌ప‌డితే చాల‌ని మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News