guntur: గుంటూరు జిల్లాలో రైల్వే టికెట్ కౌంటర్ కు నిప్పు పెట్టిన దుండగులు!

  • కొలకలూరు రైల్వేస్టేషన్ లోని టికెట్ కౌంటర్ కు నిప్పు
  • కాలి బూడిదైన కంప్యూటర్, రికార్డులు, ఫర్నీచర్
  • ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

ఓ రైల్వే టికెట్ కౌంటర్ కు దుండగులు నిప్పు పెట్టిన సంఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. తెనాలిలోని కొలకలూరు రైల్వేస్టేషన్ లోని టికెట్ కౌంటర్ కు దుండగులు నిప్పుపెట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో కంప్యూటర్, రికార్డులు, ఫర్నీచర్ పూర్తిగా కాలి బూడిదైనట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ సంఘటనకు ఎవరు పాల్పడ్డారనే విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, సంఘటనా స్థలంలో ఎమ్మార్పీఎస్ జెండాలు పడి ఉన్నట్టు తెలుస్తోంది.  

More Telugu News