salman khan: విడుద‌లైన మూడు రోజుల్లో రూ. 100 కోట్ల క్ల‌బ్‌లో చేరిన 'టైగ‌ర్ జిందా హై'

  • ఈ క్ల‌బ్‌లో చేరిన స‌ల్మాన్ ఖాన్ 12వ చిత్రం
  • రూ. 300 కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా
  • వివ‌రాలు ట్వీట్ చేసిన బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్‌

విడుద‌లైన మూడు రోజుల్లోనే రూ. 114.93 కోట్లు వ‌సూలు చేసి స‌ల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై' వంద కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయింది. ఈ సినిమాతో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన 12 సినిమాలు ఈ క్ల‌బ్‌లో చోటు సంపాదించుకున్నాయి. వంద కోట్ల క్ల‌బ్‌లో ఎక్కువ చిత్రాలు చేరిన మొద‌టి న‌టుడిగా స‌ల్మాన్ ఖాన్ రికార్డు సృష్టించార‌ని బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ పేర్కొన్నారు. ఈ వివ‌రాల‌న్నింటినీ ఆయ‌న ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన రెండు చిత్రాలు రూ. 300 కోట్ల క్ల‌బ్‌లో చేరాయి. రూ. 320.34 కోట్లు వసూలు చేసి 'భ‌జ‌రంగీ భాయ్‌జాన్‌', రూ. 300.45 కోట్లు వ‌సూలు చేసి 'సుల్తాన్' చిత్రాలు ఈ క్ల‌బ్‌లో ఉన్నాయి. 'టైగ‌ర్ జిందా హై' చిత్రం కూడా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేస్తుంద‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.

More Telugu News