tarun bhaskar: తరుణ్ భాస్కర్ న్యూ మూవీ కథా నేపథ్యం అదేనట!

  • కొత్త నటీనటులతో తరుణ్ భాస్కర్ 
  • లాంగ్ జర్నీ నేపథ్యంలో సాగే కథ 
  • సురేశ్ ప్రొడక్షన్స్ లో నిర్మాణం

తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'పెళ్లిచూపులు' .. అనూహ్యమైన విజయాన్ని సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన సత్తా చాటుకుంది. దాంతో తరుణ్ భాస్కర్ తదుపరి సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కొత్త నటీనటులతో ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు.

సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఆయన తెరకెక్కించనున్నాడు. లాంగ్ జర్నీ నేపథ్యంలో సాగే రొమాంటిక్ మూవీ ఇది అని అంటున్నారు. స్నేహితులైన కొంతమంది అబ్బాయిలు .. అమ్మాయిలు దూర ప్రాంతానికి ప్రయాణాన్ని కొనసాగిస్తూ, ఆ జర్నీలో తమని గురించి తాము తెలుసుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందట. దాదాపు పది నెలల పాటు ఈ సినిమా స్క్రిప్ట్ పై కూర్చున్న తరుణ్ భాస్కర్, ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   

More Telugu News