sundeep kishan: సందీప్ కిషన్ తమిళ హిట్ .. తెలుగులోకి!

  • తమిళంలో హిట్ కొట్టిన 'మాయావన్'
  • 'ప్రాజెక్ట్ Z' పేరుతో తెలుగులోకి 
  • కథానాయికగా లావణ్య త్రిపాఠి 
  • ఈ నెల 29న విడుదల

విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ సందీప్ కిషన్ ముందుకు వెళుతున్నాడు. ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి గానీ, ఆశించిన స్థాయిలో హిట్ పడటం లేదు. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఆయన చేసిన 'మాయావన్' భారీ విజయాన్ని అందుకుంది.

 సీవీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించింది. ఈ సినిమా అక్కడ ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాను 'ప్రాజెక్ట్ Z' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన భారీ స్థాయిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన ఈ సినిమా, ఉత్కంఠభరితమైన కథా కథనాలతో కొనసాగనుందట. తెలుగులోనూ ఈ సినిమా సందీప్ కిషన్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.       

More Telugu News