Karnataka: క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న ఆమ్ ఆద్మీ పార్టీ!

  • వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు
  • స్థానిక నాయకులతో ఆప్ నేత‌ల చ‌ర్చ‌లు
  • ఎన్నికల్లో పోటీకి కార్యకర్తలు రెడీ అంటున్న ఆప్‌

వ‌చ్చే ఏడాది క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తూ ఇప్ప‌టికే 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌మ త‌దుప‌రి టార్గెట్‌గా క‌ర్ణాట‌క‌నే పెట్టుకుంది. కాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా క‌ర్ణాట‌క‌లో పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న చేసింది. తాజాగా ఆ పార్టీ నేత‌ సంజయ్‌ సింగ్‌..  కర్ణాటక ఎన్నికల గురించి స్థానిక నేతలతో చర్చించేందుకు బెంగళూరుకు వెళ్లారు. ఆ రాష్ట్ర‌ ఎన్నికల్లో పోటీ చేయడంపై చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని తెలిపారు.

త‌మ‌ పార్టీకి ఆ రాష్ట్రంలో నాయకత్వ సమస్య ఉన్నప్ప‌టికీ త‌మ‌ కార్యకర్తలు మాత్రం ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నార‌ని తెలిపారు. మ‌రోవైపు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య ఇటీవ‌ల మాట్లాడుతూ మ‌రోసారి త‌మ రాష్ట్రంలో కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకొచ్చి త‌మ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తొలి గిఫ్ట్ ఇస్తామ‌ని ఉద్ఘాటించిన విష‌యం తెలిసిందే.  

More Telugu News