kanimozhi: ఆనందంతో ఎ.రాజాను ఆలింగనం చేసుకున్న కనిమొళి

  • 2జీ స్కాం కేసును కొట్టేసిన పటియాలా హౌస్ కోర్టు
  • కోర్టు తీర్పు వెలువడగానే తీవ్ర ఉద్వేగానికి గురైన కనిమొళి
  • మద్దతిచ్చిన వారికి ధన్యవాదాలు

2జీ స్కాం.. డీఎంకే చీఫ్ కరుణానిధి ముద్దుల తనయ కనిమొళి, కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజాలకు కొన్నేళ్ల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేసిన కుంభకోణం. ఈ కేసుకు సంబంధించి వీరిద్దరూ జైలుకు కూడా వెళ్లి వచ్చారు. తన కుమార్తె జైలు జీవితం గడిపినన్నాళ్లు రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి అనుభవించిన నరకయాతన అంతాఇంతా కాదు. ఉక్కుమనిషి లాంటి కరుణ కంటతడి కూడా పెట్టారు.

ఈ నేపథ్యంలో, సరైన ఆధారాలు లేవనే కారణంతో ఈ కేసును నేడు పటియాలా హౌస్ కోర్టు కొట్టేసింది. దీంతో కనిమొళి, రాజాలు ఊపిరి పీల్చుకున్నారు. కోర్టు తీర్పు వెలువడగానే కనిమొళి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న ఎ.రాజాను ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, కష్ట కాలంలో ఉన్నప్పుడు తమకు మద్దతిచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

More Telugu News