ananthapuram district: అనంతపురం జిల్లాలో దారుణం.. అనాథ శవాన్ని పీక్కు తింటున్న కుక్కలు

  • గత రెండు రోజులుగా శవాన్ని పీక్కుతింటున్న కుక్కలు
  • గుత్తిలో దారుణ ఘటన
  • మున్సిపాలిటీకి కూడా అందని సమాచారం

మానవత్వం మంటగలిసిందని చెప్పే దారుణ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. గుత్తి రైల్వే స్టేషన్ పక్కనున్న రైల్వేయార్డు వెనుక ఓ అనాథ శవాన్ని కుక్కలు పీక్కు తింటున్నాయి. గత రెండు రోజులుగా ఈ శవాన్ని కుక్కలు తింటున్నా... ఎవరూ కనీసం చూడను కూడా చూడలేదు. నిత్యం జనం తిరిగే ప్రదేశంలో ఈ శవం ఉన్నా ఎవరూ గుర్తించలేక పోయారు. అక్కడే రైల్వే, సివిల్ పోలీసులు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. కనీసం మున్సిపాలిటీ వారికి కూడా సమాచారం ఇవ్వలేదు. ఈ డెడ్ బాడీని పూడ్చి పెట్టే బాధ్యతను రిక్షావాళ్లకు అప్పజెప్పి ఉంటారని, వారు చెట్ల పొదల్లో దాన్ని పడేసి ఉంటారని స్థానికులు అభిప్రాయపడ్డారు.  

More Telugu News