suriya: సూర్య తదుప‌రి చిత్రంలో ర‌కుల్‌ప్రీత్‌, సాయిప‌ల్లవి?

  • సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్లు
  • కొత్త అవ‌తారంలో క‌నిపించ‌నున్న న‌టుడు
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న‌ సెల్వ రాఘ‌వ‌న్

ఇంకా పేరు కూడా నిర్ణ‌యించని త‌మిళ న‌టుడు సూర్య త‌దుప‌రి చిత్రం కోలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సెల్వ రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో విల‌క్ష‌ణ న‌టుడు సూర్య మొద‌టిసారి న‌టిస్తుండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న‌ట్లు గ‌తంలో ప్ర‌క‌టించారు. అయితే ఇప్ప‌డు సాయి ప‌ల్ల‌వి కూడా ఈ చిత్రంలో క‌థానాయిక అని, ఈ సినిమాలో ఇద్ద‌రు హీరోయిన్ల‌ని ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇద్ద‌రు హీరోయిన్లు కాబ‌ట్టి సూర్య కూడా ద్విపాత్రాభిన‌యం చేస్తారేమోన‌ని అభిమానులు విశ్లేషిస్తున్నారు. కాగా... ఈ చిత్రంలో సూర్య ఓ విభిన్న అవ‌తారంలో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మార్చి 2018 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది.

More Telugu News