krishnam raju: మేకప్ వేసుకున్న దగ్గర నుంచి తీసేసే వరకూ ఇక ప్రపంచం గుర్తుండదు: కృష్ణంరాజు

  • నా పాత్రలు సినిమాకి హెల్ప్ అయ్యేలా చూసుకున్నాను 
  • నా సినిమాలు ఇండస్ట్రీకి హెల్ప్ అయ్యేలా చూశాను 
  • ట్రెండ్ సెట్టర్ గా నిలిచే సినిమాలు నిర్మించాను
  • అంకితభావంతో పనిచేశాను    

తన గంభీరమైన రూపంతో .. స్వరంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన కథానాయకుడు కృష్ణంరాజు. కొన్ని విలన్ పాత్రలు పోషించినప్పటికీ .. హీరోగా రెబల్ స్టార్ అనిపించుకున్నారు. ఇక నిర్మాతగా ఆయన నిర్మించిన సినిమాలు భారీ విజయాలను అందుకుని ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. అలాంటి కృష్ణంరాజు తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ అనే విషయాలను పంచుకున్నారు.

 " ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకూ అంతా ఒక సిస్టమేటిక్ గా వుండాలని నేను భావిస్తాను. ఒక పాత్ర నాకు వచ్చిందంటే అది ఆ సినిమాకు పూర్తి స్థాయిలో హెల్ప్ అయ్యేలా చూడటానికి ప్రయత్నిస్తాను. అలాగే ఇండస్ట్రీకి ట్రెండ్ సెట్టర్ లా నిలిచే సినిమాలు చేశాను. 'మనవూరి పాండవులు' .. 'భక్త కన్నప్ప' .. 'కృష్ణవేణి' అందుకు ఉదాహరణలు. అలా సినిమా ఇండస్ట్రీని నా సొంతానికి ఉపయోగించుకోకుండా .. ఇండస్ట్రీకి హెల్ప్ అయ్యేలా చూశాను. మేకప్ వేసుకున్న తరువాత .. తీసేవరకూ, అంటే 10 గంటలైనా .. 12 గంటలైనా .. 14 గంటలైనా ప్రపంచం జ్ఞాపకం ఉండదు. అంత అంకిత భావంతో పనిచేస్తూ వచ్చాను" అంటూ చెప్పుకొచ్చారు.     

More Telugu News