kakinada: గుడిలో సింగ‌ర్ సునీత.. చాగంటి దంప‌తుల‌తో ఫొటో!

  • కాకినాడ‌లో జ‌రిగిన శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాల్లో పాల్గొన్న‌ సునీత
  • పుణ్య దంపతుల స‌న్నిధి అంటూ ఫొటో పోస్ట్ చేసిన సింగ‌ర్‌
  • అభిమానులను అల‌రిస్తోన్న ఫొటో

తెలుగు సినీ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకున్న సింగ‌ర్ సునీతకు సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్లు అధికంగానే ఉన్నారు. ఆమె పాడే పాటలు, మాట్లాడే మాటలు ఎంతో తియ్యగా ఉంటాయ‌ని అభిమానులు కొనియాడుతుంటారు. ఆమె సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌నకు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటారు. తాజాగా ఆమె చేసిన ఓ ఫేస్‌బుక్ పోస్ట్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. పుణ్య దంపతుల స‌న్నిధి అంటూ ఆమె ఓ మందిరంలో ప్ర‌వ‌చ‌న క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు దంప‌తులతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.

ఆమెకు ఆధ్యాత్మిక భావం కూడా ఎక్కువేన‌ని నెటిజ‌న్లు కితాబిస్తున్నారు. ఇటీవ‌ల కాకినాడ‌లో జ‌రిగిన శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాల్లో సునీత అన్న‌మాచార్య కీర్త‌న‌లు పాడారు. ఈ సంద‌ర్భంగానే ఆమె చాగంటి దంప‌తుల‌తో ఫొటో తీసుకున్నారు. చీర‌క‌ట్టులో తెలుగుద‌నం ఉట్టిప‌డేలా ఆమె క‌న‌ప‌డుతున్నారు.

More Telugu News