India: మళ్లీ హనీట్రాప్... అందమైన అమ్మాయిలను పంపిస్తున్న పాకిస్థాన్!

  • దౌత్యాధికారులపై అందగత్తెల వల
  • రహస్య సమాచారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం
  • ముందే పసిగట్టిన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్

భారత రహస్యాలను తెలుసుకునేందుకు అందమైన అమ్మాయిలను ఎంపిక చేసి, వారిని ఉసిగొల్పుతున్న పాకిస్థాన్, ఈ దఫా దౌత్యాధికారులను టార్గెట్ చేసింది. ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) అధికారులు ముగ్గురు అమ్మాయిలతో ఇస్లామాబాద్ లోని భారత ఎంబసీ అధికారులను ట్రాప్ చేయగా, విషయాన్ని పసిగట్టిన భారత 'రా' సిబ్బంది, వారిని రహస్యంగా ఇండియాకు పిలిపించి, విచారిస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం వీరిని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

కాగా, రహస్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని వీరు ముగ్గురి నుంచి రాబట్టేందుకు అందగత్తెలు ప్రయత్నించగా, ఆ ప్రయత్నాన్ని మన అధికారులు మొగ్గలోనే తుంచేసినట్టు తెలుస్తోంది. వీరు తప్పు చేసినట్టు ఆధారాలు లభించలేదని, పాక్ కుటిల పన్నాగం ముందే తెలిసిపోవడంతో వారిని వెంటనే ఇండియాకు రప్పించామని ఉన్నత వర్గాలు వెల్లడించాయి.

More Telugu News