telugu sabhalu: ప్ర‌పంచ తెలుగు మ‌హా స‌భ‌లు ప్రారంభం

  • హైద‌రాబాద్ చేరుకున్న ఉప రాష్ట్ర‌ప‌తి
  • కాసేప‌ట్లో వెంకయ్య నాయుడి ప్ర‌సంగం
  • ఎల్బీ స్టేడియం ప‌రిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

హైదరాబాద్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించ త‌ల‌పెట్టిన‌ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల ప్ర‌ధాన వేదిక అయిన లాల్ బ‌హ‌దూర్ స్టేడియంలో కాసేప‌ట్లో ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్ర‌సంగం ఇవ్వ‌నున్నారు. ఇందు కోసం ఆయ‌న ఇప్ప‌టికే హైద‌రాబాద్ చేరుకున్నారు.

ఇప్పటికే ఎల్బీ స్టేడియానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ప‌లువురు రాష్ట్ర‌ మంత్రులు చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఎల్బీ స్టేడియం ప‌రిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు కొన‌సాగుతున్నాయి. మొత్తం ఐదు రోజులపాటు ఈ స‌భ‌లు ఘనంగా జ‌ర‌గ‌నున్నాయి. తెలుగు సంస్కృతి ఉట్టిప‌డేలా స‌భా వేదిక‌ల‌ను ఏర్పాటు చేశారు.      

More Telugu News