BJP: దేశాన్ని బీజేపీ బలహీన పరుస్తోంది: రాహుల్ గాంధీ మండిపాటు

  • కేర‌ళ‌లో ప‌ర్య‌టిస్తోన్న రాహుల్ గాంధీ
  • మా పార్టీ ఏనాడూ ద్వేషాన్ని వ్యాపింపజేయదు
  • బీజేపీ మాత్రం ఆ ప‌నే చేస్తోంది
  • బీజేపీ ఓ దుష్టశక్తి.. దానిపై పోరాడాలి

భార‌తీయ జ‌న‌తా పార్టీ దేశాన్ని బలహీన పరుస్తోందని ఏఐసీసీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. అటువంటి పార్టీ విషయంలో దేశ ప్రజలు కఠినంగా ఉండాలని వ్యాఖ్యానించారు. కేర‌ళ‌లో ప‌ర్య‌టిస్తోన్న రాహుల్ గాంధీ ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ...  త‌మ పార్టీ ఏనాడూ ద్వేషాన్ని వ్యాపింపజేయద‌ని, అలాగే దేశంలోని సంస్థలను ధ్వంసం చేయబోమ‌ని అన్నారు.

 బీజేపీ మాత్రం ఇటువంటి ప‌నులు చేస్తోంద‌ని ఆరోపించారు. బీజేపీ ఓ దుష్టశక్తి అని, దానిపై పోరాడాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. అలాగే, కేరళ ప్ర‌భుత్వం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఫాసిస్టు శక్తులకు సీపీఎం నిజంగా వ్యతిరేకం అయితే, ఆ పార్టీ జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధంగా ఉండాల‌ని అన్నారు.

More Telugu News