roja: పింఛ‌న్ కోసం సీసీ కెమెరాకు త‌న బాధ చెప్పుకుంటోన్న వృద్ధురాలు... వీడియో పోస్ట్ చేసిన రోజా!

  • పింఛ‌న్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన వృద్ధురాలి ధీన‌గాథ
  • ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినా లాభం లేద‌ని ఆవేద‌న‌
  • విజ‌య‌న‌గ‌రం నుంచి విజ‌య‌వాడ వ‌చ్చిన వృద్ధురాలు

'పింఛ‌న్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన ఓ వృద్ధురాలి ధీన‌గాథ' అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఈ రోజు ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఓ వృద్ధురాలు ఓ స్తంబానికి ఉన్న‌ సీసీ కెమెరా వ‌ద్ద‌కు వ‌చ్చి త‌న బాధ‌ను చెప్పుకుంది. త‌న‌కు రావాల్సిన‌ పింఛ‌న్ కోసం ఎన్నిసార్లు విన్న‌వించుకున్నా స్థానిక నేత‌లు, అధికారులు ప‌ట్టించుకోలేద‌ని ఆమె ఆ సీసీ టీవీ కెమెరాను చూస్తూ రెండు చేతులూ జోడించి చెప్పింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి త‌న బాధ‌ను చెప్పుకునే అవ‌కాశం లేకుండా పోతోంద‌ని, తాను విజ‌య‌న‌గ‌రం నుంచి విజ‌య‌వాడ‌కు వ‌చ్చాన‌ని ఆమె ఆవేద‌న చెందింది. మీరూ చూడండి..   

More Telugu News