bodiga sobha: టీఆర్ఎస్ కు మరో తలనొప్పి.. టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే!

  • టోల్ ప్లాజా సిబ్బందిపై బొడిగ శోభ దంపతుల దాడి
  • టోల్ ఫీజు వసూలు చేయరాదంటూ దౌర్జన్యం
  • నానాటికీ పెరుగుతున్న టీఆర్ఎస్ నేతల దాడులు

టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల రూపంలో తలనొప్పులు ఎదురవుతూనే ఉన్నాయి. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆడియో టేపులు ఇటీవల కలకలం రేపితే, నిన్న మంత్రి చందూలాల్ కుమారుడి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మరో ఉదంతం వెలుగు చూసింది.

ఎమ్మెల్యే బొడిగ శోభ, ఆమె భర్త, గన్ మెన్లు రేణికుంట గ్రామం వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై గల టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, టోల్ ప్లాజా వద్దకు వచ్చిన తర్వాత తమ వాహనాలకు టోల్ ఫీజు తీసుకోరాదంటూ సిబ్బందికి చెప్పారు. వారు ఒప్పుకోకపోవడంతో, దాడికి పాల్పడ్డారు. జరుగుతున్న తతంగాన్ని చిత్రీకరిస్తున్న కొందరి మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారు.


More Telugu News