raj tarun: థాయ్ ల్యాండ్ వెళుతోన్న 'రాజుగాడు'

  • టాకీ పార్టు పూర్తి చేసుకున్న 'రాజుగాడు' 
  • రాజ్ తరుణ్ జోడీగా అమైరా దస్తూర్ 
  • పెండింగ్ లో రెండు పాటలు
  • త్వరలో విదేశాలకి  

ఈ మధ్య కాలంలో సక్సెస్ గ్రాఫ్ కాస్త తగ్గినా రాజ్ తరుణ్ తన దూకుడును మాత్రం తగ్గించడం లేదు. ఆయన తాజా చిత్రంగా 'రాజుగాడు' తెరకెక్కుతోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా సంజనా రెడ్డి పరిచయమవుతుండగా, అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ఇక రెండు పాటలు మాత్రమే పెండింగ్ లో వున్నాయి.

 ఈ పాటలను థాయ్ ల్యాండ్ లో చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. ఈ నెల 20వ తేదీన అక్కడికి చేరుకోనున్నట్టు దర్శకురాలు సంజనా రెడ్డి చెప్పారు. మొదటిసారిగా మెగా ఫోన్ పట్టిన తనకి యూనిట్ నుంచి .. సీనియర్ ఆర్టిస్టుల నుంచి మంచి సహకారం లభిస్తోందని ఆమె అన్నారు. అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందనీ, తనకి ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పారు. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా సమాచారం.        

More Telugu News