rangasthalam: 'రంగ‌స్థ‌లం 1985' సినిమా స్టిల్స్ లీక్‌... పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన నిర్మాణ సంస్థ‌!

  • సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌ను ఆశ్రయించిన మైత్రి మూవీ మేక‌ర్స్‌
  • సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న రెండు ఫొటోలు
  • అధికారికంగా విడుద‌ల చేయ‌క‌ముందే నెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన స్టిల్స్‌

ఇటీవ‌ల 'రంగ‌స్థ‌లం 1985' చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్ ఫ‌స్ట్‌లుక్‌ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ లుక్‌తో పాటు మ‌రో రెండు ఫొటోలు కూడా అదే రోజు నెట్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. అయితే అవి అధికారికంగా విడుద‌ల చేసిన‌వి కాక‌పోవ‌డంతో చిత్ర‌నిర్మాణ సంస్థ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీన్ని సైబ‌ర్ క్రైమ్ కింద పోలీసులు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

స‌మంత‌, రామ్ చ‌ర‌ణ్ ఉన్న స్టిల్ ఒక‌టి, మొక్క‌జొన్న కంకులు మోస్తున్న రామ్‌చ‌ర‌ణ్ మ‌రొక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అధికారికంగా విడుద‌ల చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ అభిమానులు వీటిని విప‌రీతంగా షేర్ చేస్తున్నారు. అయితే వీటిని మొద‌ట ఎవ‌రు అప్‌లోడ్ చేశారో తెలుసుకునే ప్ర‌య‌త్నంలో పోలీసులు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

More Telugu News