flipkart: ఫ్లిప్‌కార్ట్ నుంచి మ‌రో సేల్‌... న్యూ పించ్ డేస్ పేరుతో ఆఫ‌ర్ల వెల్లువ‌!

  • డిసెంబ‌ర్ 15 నుంచి 17వ‌ర‌కు సేల్‌
  • మొబైల్ అమ్మ‌కాల‌పై భారీ ఆఫ‌ర్లు
  • శాంసంగ్ ఆన్ నెక్స్ట్ పై భారీ త‌గ్గింపు

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త సేల్‌లు నిర్వ‌హిస్తూ వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునే ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం ఫ్లిప్‌కార్ట్  మ‌రో కొత్త సేల్ నిర్వ‌హించ‌బోతోంది. 'న్యూ పించ్ డేస్‌' పేరుతో డిసెంబ‌ర్ 15 నుంచి 17 వ‌ర‌కు ఈ సేల్ నిర్వ‌హించ‌నుంది. ఇందులో మొబైల్ అమ్మ‌కాల‌పై భారీ ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ ప్ర‌క‌టించింది. అలాగే శాంసంగ్ ఆన్ నెక్స్ట్ 64 జీబీ మీద భారీ త‌గ్గింపు ఇవ్వ‌నున్న‌ట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. ప్రస్తుతం రూ. 17,999 ఉన్న ఈ మోడ‌ల్‌ని చాలా త‌క్కువ ధ‌రకు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ ఈ ఆఫ‌ర్‌ను `ఆఫ‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌`గా పేర్కొంది.

అలాగే టాప్ బ్రాండ్ వ‌స్త్రాల మీద 50 - 80 శాతం, ఫ‌ర్నీచ‌ర్‌, గృహావ‌స‌రాల మీద 40-80 శాతం, ఎల‌క్ట్రానిక్స్ మీద 80 శాతం వ‌ర‌కు డిస్కౌంట్లు ఇవ్వ‌నున్నట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ సేల్‌లో కొన్న‌వారికి హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల మీద ప‌ది శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

More Telugu News