Chandrababu: అవ‌గాహ‌న పెంచుకుని మాట్లాడాలి: ప‌వ‌న్ క‌ల్యాణ్‌ విమర్శలపై చంద్ర‌బాబు వ్యాఖ్య

  • పోల‌వ‌రం ప్రాజెక్టుని ప‌రిశీలించిన చంద్ర‌బాబు
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌ల‌పై స్పంద‌న‌
  • ఈ ప్రాజెక్టుపై ఎవ‌రికేమి అవ‌గాహ‌న ఉంది?
  • కొంద‌రు అవ‌గాహ‌నారాహిత్యంతో మాట్లాడుతున్నారు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఈ రోజు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌తి సోమ‌వారాన్ని పోల‌వారంగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. ఆ ప్రాజెక్టుని సంద‌ర్శించి పోల‌వ‌రం పనులు జ‌రుగుతోన్న తీరును ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. పోల‌వ‌రం ప‌నుల‌పై సినీన‌టుడు, జ‌న‌సేత అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. ఈ ప్రాజెక్టుపై అవ‌గాహ‌న పెంచుకుని మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుపై ఎవ‌రికేమి అవ‌గాహ‌న ఉంది? అని అన్నారు. కొంద‌రు అవ‌గాహ‌నా రాహిత్యంతో మాట్లాడుతున్నారని తెలిపారు.

కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఈ ప్రాజెక్టుపై చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై కూడా చంద్ర‌బాబు అభ్యంత‌రం తెలిపారు. జ‌గ‌న్‌కు కాంక్రీటు, పిల్ల‌ర్ గురించి తెలుసా? అని ప్ర‌శ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో రాజీలేదని, ఎవ‌ర‌యినా అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. పోల‌వ‌రం భావిత‌రాల‌కు చెందిన ప్రాజెక్ట‌ని, ఇది ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు సంబంధించిన విష‌య‌మ‌ని అన్నారు. ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ఆడుకుంటే తీవ్ర ప‌రిణామాలుంటాయ‌ని హెచ్చ‌రించారు.

More Telugu News