MS Dhoni: ఇంత ఘోరమా?... 16 పరుగులకే సగం మంది అవుట్!

  • భారత క్రికెటర్లను ఓ ఆట ఆడుకుంటున్న లంక బౌలర్లు
  • లక్మల్ కు 3 వికెట్లు
  • 16 పరుగుల వద్ద రెండు వికెట్లు డౌన్
  • భారత్ స్కోరు 25/5

ధర్మశాలలో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక బౌలర్లు భారత ఆటగాళ్లను ఓ ఆట ఆడుకున్నారు. సీమర్లకు అనుకూలిస్తున్న పిచ్ పై నిప్పులు చెరిగే బంతులు విసురుతూ వరుసగా వికెట్ మీద వికెట్ తీస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో శ్రేయాస్ 9 పరుగులు మాత్రమే చేసి, ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు పాండే 2 పరుగులు మాత్రమే చేసి లక్మల్ బౌలింగ్ లో మ్యాథ్యూస్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ప్రస్తుతం క్రీజులో ధోనీ, పాండ్యా ఉండగా, వీరిద్దరూ స్వల్ప స్కోరుకే అవుట్ అయితే, భారత జట్టు మొత్తం స్కోరు 100 పరుగు దాటడం కూడా అనుమానమే. భారత జట్టు 0, 2, 8 పరుగుల వద్ద ఒక్కో వికెట్ ను, 16 పరుగుల వద్ద రెండు వికెట్లనూ కోల్పోయింది. లక్మల్ కు మూడు వికెట్లు దక్కాయి. ఇక ధర్మశాలలో టీమిండియా ఘోరంగా ఆడుతుండటంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News