India: బెంబేలెత్తుతున్న టీమిండియా... పేలవంగా అవుట్ అయిన కెప్టెన్ రోహిత్!

  • విరాట్ లేకుండా బరిలోకి టీమిండియా
  • ఫామ్ లో ఉన్న ఓపెనర్లు ఇద్దరూ అవుట్
  • మిడిలార్డర్ పై పెరిగిన ఒత్తిడి

కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగిన భారత జట్టును ఓ ఆట ఆడుకుంటామని హెచ్చరించిన శ్రీలంక జట్టు అన్నంతపనీ చేసింది. లక్మల్ తన అద్భుతమైన బౌలింగ్ తో భారత్ ను ఆదిలోనే చావుదెబ్బ తీశాడు. ఆరు బంతులాడిన ఓపెనర్ ధావన్ డక్కౌట్ కాగా, 13 బంతులాడిన కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులు మాత్రమే చేసి పెవీలియన్ దారి పట్టాడు. లక్మల్ వేసిన ఓ ఇన్ స్వింగర్ ను శర్మ ఆడబోగా, అది నేరుగా కీపర్ డిక్ వెల్లా చేతుల్లోకి వెళ్లింది. ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుట్ కావడంతో భారత మిడిలార్డర్ పై ఒత్తిడి పడింది. ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్, కేడీ కార్తీక్ లు ఆడుతున్నారు. భారత స్కోరు 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 6 పరుగులు.

More Telugu News