nikhil: నిఖిల్ సినిమా రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • నిఖిల్ హీరోగా 'కిరాక్ పార్టీ'
  • చాలావరకూ చిత్రీకరణ పూర్తి 
  • కథానాయికలుగా సంయుక్త హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా

నిఖిల్ హీరోగా నూతన దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఒక సినిమా చేస్తున్నాడు. సుంకర రామబ్రహ్మం నిర్మిస్తోన్న ఈ సినిమా, కన్నడలో సూపర్ హిట్ అయిన 'కిరిక్ పార్టీ'కి రీమేక్. ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమాకి తెలుగులో 'కిరాక్ పార్టీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

 కాలేజ్ క్యాంపస్ లో జరిగే రాజకీయాలు .. వాటి పరిణామాలకి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఫిబ్రవరి 9వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. డిఫరెంట్ లుక్ తో నిఖిల్ కనిపించే ఈ సినిమాలో ఆయన సరసన, సంయుక్త హెగ్డే .. సిమ్రాన్ పరీన్జా కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు. ఇక కొత్త హీరోయిన్స్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.     

More Telugu News