fans: నినాదాలు చేస్తున్న ఫ్యాన్స్‌ను గ‌ట్టిగా హెచ్చ‌రించిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

  • విజ‌య‌వాడ‌లో త‌మ ఫ్యాన్స్‌, కార్య‌క‌ర్త‌ల‌తో ప‌వ‌న్ స‌మావేశం
  • లీడ‌ర్ లీడ‌ర్‌, సీఎం సీఎం అంటూ ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున‌ నినాదాలు
  • సీఎం సీఎం అని మీరు అరిస్తే నేను సీఎం అయిపోతానా?
  • ఆలోచ‌న ఉండి, స‌రైన విధివిధానాల‌తో ముందుకు వెళితేనే మార్పు సాధ్యం-ప‌వ‌న్‌

గంద‌ర‌గోళం సృష్టిస్తోన్న త‌న ఫ్యాన్స్‌ను, కార్య‌క‌ర్త‌ల‌ను జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌ట్టిగా హెచ్చ‌రించారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో గుంటూరు, కృష్ణా జిల్లాల పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ స‌మావేశం ఏర్పాటు చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పేది విన‌కుండా అంద‌రూ లీడ‌ర్ లీడ‌ర్‌, సీఎం సీఎం అని పెద్ద ఎత్తున‌ నినాదాలు చేశారు.

దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ... "మీరు పుట్టిన ఈ గ‌డ్డ మీద గౌర‌వం ఉంటే.. నాపై కాకుండా, జ‌నసేన పార్టీకి కాకుండా భార‌త్ మాత‌కి జై చెప్పండి అని అన్నారు. ప్ర‌తిసారి సీఎం సీఎం అని మీరు అరిస్తే నేను సీఎం అయిపోతానా? అరుపులు కేక‌ల‌తో మార్పులు రావు, ఆలోచ‌న‌ల‌తో కూడిన సంస్క‌ర‌ణ‌ల వ‌ల్ల మార్పులు వ‌స్తాయి.

దేశం బాగుప‌డాల‌న్న ఆలోచ‌న ఉండి, స‌రైన విధివిధానాల‌తో ముందుకు వెళితేనే మార్పు సాధ్యం. మీ ఉత్సాహాన్ని మార్పుకు, జ‌న‌సేనను క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ముందుకు తీసుకువెళ్లడానికి ఉప‌యోగించాలి. అరుపులు, కేక‌ల‌తో మార్పులు రావు" అని చెప్పుకొచ్చారు.

More Telugu News