Narendra Modi: మీరు అనుకున్న సమయంలో అయోధ్య‌లో రామాలయం నిర్మించ‌లేరు: మోదీపై క‌పిల్ సిబాల్ విమర్శ‌లు

  • శ్రీరాముడు అనుకున్న‌ప్పుడే జ‌రుగుతుంది
  • బీజేపీ నేత‌లు, మోదీ శ్రీరాముడిని న‌మ్ముకున్నారు
  • రాముడు మాత్రం వారిని న‌మ్మడం లేదు

అయోధ్య‌లో రామాలయం ప్ర‌ధాని మోదీ అనుకున్నపుడు రాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్ వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో అయోధ్య భూమి వివాదంపై వాద‌న‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో సున్నీ వక్ఫ్ బోర్డ్ త‌ర‌ఫున క‌పిల్ సిబాల్ వాదించారు. తాజాగా ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ... అయోధ్యలో రామాలయం శ్రీరాముడు కోరుకున్నప్పుడే వస్తుందని అన్నారు. మోదీ అనుకున్న సమయంలో ఆ ఆల‌యాన్ని నిర్మించడం కుదర‌ద‌ని వ్యాఖ్యానించారు. శ్రీ రాముడిని బీజేపీ నేతలు, మోదీ నమ్ముకున్నారని, కానీ శ్రీ రాముడు మాత్రం వారిని నమ్మడం లేదని ఆయ‌న ఎద్దేవా చేశారు. 

More Telugu News