nagachaitanya: భారీ సెట్లో 'సవ్యసాచి' షూటింగ్ .. మాధవన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

  • షూటింగు దశలో 'సవ్యసాచి'
  • అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ 
  • హైలైట్ గా నిలవనున్న మాధవన్ పాత్ర 
  • కథానాయికగా నిధి అగర్వాల్

చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలనే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా, ప్రస్తుతం హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. కొత్తలుక్ తో చైతూ కనిపించనున్న ఈ సినిమాలో, తమిళ స్టార్ హీరో మాధవన్ ఒక కీలకమైన రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన ఇంటికి సంబంధించిన భారీ సెట్లో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇంతవరకూ చేయని ఒక డిఫరెంట్ రోల్ ను ఆయన ఈ సినిమాలో చేస్తున్నట్టుగా తెలుస్తోంది. విలక్షణంగా మలచబడిన ఆయన పాత్ర ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఈ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమవుతోంది. 'ప్రేమమ్' హిట్ తరువాత చందూ .. చైతూ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది.          

More Telugu News